
ప్రస్తుత కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బలహీనతకు గురవుతుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేం ఏకాగ్రత పూర్తిగా దెబ్బ తింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తేలికగా జీర్ణమయ్యేవి, శరీరానికి శక్తి లభించే వాటిని ఎప్పుడూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో బలహీనతకు కారణం: విటమిన్ బి12 లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. డిప్రెషన్, ఆందోళన కూడా శరీరాన్ని బలహీనం చేస్తాయి. ఇది ఏదో ఒక రకమైన వ్యాధి వల్ల కూడా ఇలా జరుగుతుంది. శరీరంలో బలహీనత ఉంటే ఆహారంలో వీటిని జోడించండి..

పచ్చి కూరగాయలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఫైబర్ కూరగాయలలో లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. దీంతో పొట్ట త్వరగా నిండడంతో పాటు ఆకలిని ఎక్కువసేపు అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గుతుంది. ఊబకాయం పెరగదు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పచ్చి కూరగాయలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ప్రోటీన్ లోపం మొదటి సంకేతం వాపు. చేతులు, కాళ్ళు లేదా పొత్తికడుపులో వాపు కనిపించవచ్చు. ప్రోటీన్ రక్తంలోని ద్రవాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. దాని లోపం ఉన్నప్పుడు, కణజాలాలలో నీరు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. శరీరం ఉబ్బుతుంది. ప్రోటీన్ కండరాలను నిర్మించడమే కాకుండా, మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు మెదడు రసాయనాలను (డోపమైన్, సెరోటోనిన్ వంటివి) తయారు చేయడంలో సహాయపడతాయి. వీటిలో లోపం ఉంటే, ఒక వ్యక్తి చిరాకు, విచారం, నిరాశకు గురవుతాడు.

నట్స్, తృణ ధాన్యాలు తినండి: శరీరంలో బలహీనత ఉన్నప్పుడు నట్స్, తృణ ధాన్యాలు తినవచ్చు. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా అవి సులభంగా జీర్ణమవుతాయి. మరోవైపు ప్రతిరోజూ నట్స్, తృణ ధాన్యాలును తీసుకుంటే మీ బలహీనత, అలసట తొలగిపోతుంది.