వెనక్కి తగ్గిన పెప్సీకో.. రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ

దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనతో పెప్సీ కో కంపెనీ వెనకడుగు వేసింది. గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రైతులపై పెట్టిన కేసులను తమ కంపెనీ ఉపసంహరించుకుందని అన్నారు. కాగా, పెప్సీకోకు చెందిన లేస్, చిప్స్ కోసం బంగాళాదుంపపై ఆ సంస్థ పేటెంట్ తీసుకుందంటూ.. పేటెంట్ పొందిన బంగాళాదుంపలను గుజరాత్ రైతులు నలుగురు పండించారని ఆరోపిస్తూ వారిపై పెప్సీకో సంస్థ కేసు పెట్టింది. పెప్సీకో తీరును […]

వెనక్కి తగ్గిన పెప్సీకో.. రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ
Follow us

| Edited By:

Updated on: May 02, 2019 | 9:59 PM

దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనతో పెప్సీ కో కంపెనీ వెనకడుగు వేసింది. గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రైతులపై పెట్టిన కేసులను తమ కంపెనీ ఉపసంహరించుకుందని అన్నారు. కాగా, పెప్సీకోకు చెందిన లేస్, చిప్స్ కోసం బంగాళాదుంపపై ఆ సంస్థ పేటెంట్ తీసుకుందంటూ.. పేటెంట్ పొందిన బంగాళాదుంపలను గుజరాత్ రైతులు నలుగురు పండించారని ఆరోపిస్తూ వారిపై పెప్సీకో సంస్థ కేసు పెట్టింది. పెప్సీకో తీరును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఆ నలుగురు రైతులపై పెట్టిన కేసులను పెప్సికో ఉపసంహరించుకుంది.