మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై మద్యం విక్రయాలకు..
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలల పాటు మద్యం దొరక్క అల్లాడిపోయిన
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలల పాటు మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులకు ఒడిశా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే మద్యం హోం డెలివరీని ప్రారంభించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఒడిశా స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ (ఓఎస్బీసీ) ఏకంగా ఓ పోర్టల్నే ప్రారంభించింది.
కాగా.. లాక్డౌన్ నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మే 24న మద్యం హోం డెలివరీని ప్రారంభించింది. మందుబాబులు ఆయా దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన నంబర్లకు ఫోన్ చేస్తేనే హోం డెలివరీ జరిగేది. ఇందుకోసం జోమాటో, స్విగ్గీ వంటి అగ్రిగేటర్ల సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. అయితే, తమ ఫోన్ నంబర్లు మందుబాబులకు చేరేందుకు రిటైలర్లు విస్తృతంగా ప్రచారం చేసేవారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఆదివారం వరకు సుమారు దాదాపు రెండున్నర లక్షల ఆర్డర్లు వచ్చాయి.
అయితే.. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మద్యం డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని https://osbc.co.in/ అనే పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్లో ఆ జిల్లాలో ఉన్న రిటైలర్ల వివరాలు, బ్రాండ్లు, ఎంఆర్పీ తదితర వివరాలు ఉంటాయి. ఆన్లైన్లోనే ఆర్డర్ చేయొచ్చని చెబుతున్నారు అధికారులు. అలా ఆర్డర్ చేయగానే ఎంఆర్పీతో పాటు, డెలివరీ ఛార్జీలతో కూడిన బిల్లు కూడా ఆన్లైన్లోనే పంపిస్తారట. త్వరలో యూపీఐ, నెట్బ్యాంకింగ్, ఫీడ్బ్యాక్ వంటి ఫీచర్లను కూడా తీసుకొస్తారట.
Also Read: కరోనా ట్రెండీ కలెక్షన్.. డిజైనర్ మాస్కులు.. న్యూ ఫ్యాషన్..