ఓటీటీలో ‘కేజీఎఫ్ 2’.. క్లారిటీ ఇచ్చిన హీరో..!
ఓటీటీలో KGF 2 సినిమాను విడుదల చేయట్లేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని యశ్ తేల్చి చెప్పాడు. బిగ్ స్క్రీన్పై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా..
2018లో విడుదలై అన్ని భాషల్లోనూ సంచలన విజయం నమోదు చేసుకున్న చిత్రం ‘కేజీఎఫ్’. దీనికి సీక్వెల్గా తెరకెక్కుతోంది ‘కేజీఎఫ్ 2’. కన్నడ నటుడు యశ్ ప్రధాన పాత్రలో.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడటంతో చాలామంది నిర్మాతలు డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫార్మ్లో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. ఇదే కోవలో KGF 2 సినిమా కూడా ఓటీటీలో విడుదల కాబోతోందని.. ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ హక్కులను భారీ ధరకు అమ్మేసినట్లు సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనితో ఈ ప్రచారంపై చిత్ర హీరో యశ్ స్పందించాడు.
ఓటీటీలో సినిమాను విడుదల చేయట్లేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని యశ్ తేల్చి చెప్పాడు. బిగ్ స్క్రీన్పై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నాం. మొదటి భాగం కంటే రెండో పార్ట్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుందని చెప్పాడు. కాగా, ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన వెంటనే మిగిలిన చిత్రీకరణను కూడా పూర్తి చేసి అక్టోబర్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.