ఆ దేశంలో కరోనా పెషెంట్స్ లేరంటా..!
ప్రపంచవ్యాప్తంగా నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతుంటే డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో న్యూజిలాండ్ దేశం శుభవార్త తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న చివరి బాధితుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ దేశంలో గత వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా బుధవారం కరోనా బారి నుంచి బయటపడ్డ చిట్టచివరి పేషెంట్ను ఆక్లండ్లోని మిడిల్మోర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. న్యూజిలాండ్ […]
ప్రపంచవ్యాప్తంగా నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతుంటే డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో న్యూజిలాండ్ దేశం శుభవార్త తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న చివరి బాధితుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ దేశంలో గత వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా బుధవారం కరోనా బారి నుంచి బయటపడ్డ చిట్టచివరి పేషెంట్ను ఆక్లండ్లోని మిడిల్మోర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డన్స్ అనుసరించిన విధివిధానాలు, ఆమె సమర్థవంతమైన నాయకత్వమే ప్రాణాంతక వైరస్తో సాగిన పోరాటంలో గెలుపుకు కారణమైందని ప్రజలు ఆమెకు జేజేలు పలుకుతున్నారు. ఆ దేశంలో ఆరు కరోనా కేసులు నమోదవగానే దేశ ప్రజలందరూ రెండు వారాలపాటు సెల్ఫ్ ఐసోలేట్లో ఉండాలని ప్రధాని జెసిండా పిలుపునిచ్చారు. బాధితుల సంఖ్య 28కు చేరుకునే సమయానికి విదేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. అంతేకాక దేశంలో 2,67,435 కరోనా పరీక్షలు నిర్వహించడం విశేషం. ఇప్పటివరకు అక్కడ 1504 కేసులు నమోదవగా 22 మంది చనిపోయారు, మిగతా అందరూ కోలుకున్నారు.