విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో కొత్త ట్విస్ట్..
గ్యాంగ్ వార్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తోట సందీప్ భార్య పలు కీలక విషయాలను వెల్లడించారు.
విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తోట సందీప్ భార్య పలు కీలక విషయాలను వెల్లడించారు. సందీప్ను పక్కాగా స్కెచ్తో హత్య చేశారన్న ఆమె.. ఈ హత్య వెనుక రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. అసలు సందీప్కు ల్యాండ్ సెటిల్మెంట్ గొడవకు సంబంధం లేదని తెలిపారు. గ్యాంగ్ వార్ ఘటనకు ముందు రోజే పండు సందీప్ను ఫోన్లో బెదిరించారని ఆమె అన్నారు. ఆ రోజు సందీప్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పండు ఐరన్ షాపు దగ్గరకు వెళ్లి అక్కడున్న గుమస్తాపై కత్తితో దాడి చేశాడని చెప్పుకొచ్చారు.
సందీప్కు ఫోన్ చేసి ‘నీ కుటుంబాన్ని అంతం చేస్తానని’ పండు బెదిరిచేవాడని.. ‘మాట్లాడుకుందాం రా’ అని పటమటకు పిలిచి హత్యకు కుట్ర పన్నాడని సందీప్ భార్య తేజస్వినీ తెలిపారు. తాము ప్రేమ వివాహం చేసుకున్నామని ఆమె.. సందీప్ హత్యపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. కాగా, పండు, ప్రభు, ప్రశాంత్, రవితేజ అలియాస్ బుల్లి ఈ నలుగురూ కలిపి సందీప్ను హత్య చేయడానికి కుట్రపన్నారని.. నిందితులకు కఠిన శిక్షపడాలని తెలిపింది.