కంగనాకు భద్రత కల్పిస్తాం, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్

| Edited By: Pardhasaradhi Peri

Sep 07, 2020 | 10:14 AM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి భద్రత కల్పిస్తామని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ ప్రకటించారు. ఇక్కడే కాదు, ఆమె ముంబై వెళ్లినా అక్కడ కూడా సెక్యూరిటీ కల్పించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు..

కంగనాకు భద్రత కల్పిస్తాం, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్
Follow us on

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి భద్రత కల్పిస్తామని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ ప్రకటించారు. ఇక్కడే కాదు, ఆమె ముంబై వెళ్లినా అక్కడ కూడా సెక్యూరిటీ కల్పించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. హిమాచల్ ‘కూతురి’గా, ఒక సెలబ్రిటీగా ఆమెకు రక్షణ కల్పించడం మా బాధ్యత అన్నారు. కంగనాకు సెక్యూరిటీ కల్పించాలని ఆమె సోదరి, ఆమె తండ్రి కూడా తమ ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన తెలిపారు. ఈ నెల 9 న కంగనా ముంబై చేరుకోనుంది. సుశాంత్ కేసులో ఆమె చేసిన వ్యాఖ్యలపైనా, శివసేన నేత సంజయ్ రౌత్ కి , ఆమెకు మధ్య తలెత్తిన కీచులాటపైనా వ్యాఖ్యానించేందుకు జైరాం ఠాకూర్ నిరాకరించారు. ముంబైని కంగనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా అభివర్ణించింది. అయితే దీనిపైనా స్పందించేందుకు ఠాకూర్ అంగీకరించలేదు.