జమ్ముకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. ఉదంపూర్ జిల్లాలోని టిక్రీ ప్రాంతంలో ఓ ఎల్పీజీ సిలిండర్ ట్రక్కు పేలిపోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తున్న సమయంలో.. జాతీయ రహదారిపై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో సిలిండర్లు పెద్ద ఎత్తున శబ్ధం చేస్తూ పేలాయి. ఈ ఘటనలో ట్రక్కు మొత్తం కాలిపోయింది. పేలుడు ధాటికి అక్కడి ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దాదాపు అరగంట పాటు.. డజన్ల కొద్ది సిలిండర్లు పేలాయి. పేలుడు ధాటికి అక్కడి సమీప ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ట్రక్కులో మంటలు అదుపులోకి రాకపోవడంతో.. తాత్కాలికంగా ఆ రహదారిని మూసేశారు. ట్రక్కులో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత.. వాహన రాకపోకలను పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఘటన జరిగిన సమయంలో దూరంగా ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు. అందులో సిలిండర్లు పేలుతున్న శబ్దం వినిపిస్తోంది.
#WATCH Jammu & Kashmir: A truck carrying LPG cylinders caught fire on its way to Kashmir in Manthal area of Udhampur district; Movement of vehicles on both sides of the road has been stopped. More details awaited. pic.twitter.com/UcSz3dgDLa
— ANI (@ANI) May 29, 2020