Chidambaram Temple: మళ్ళీ వివాదంలో చిదంబర నటరాజస్వామి సంపద.. ఆలయ సంపదపై ప్రభుత్వానికి హక్కులేదంటున్న దీక్షిత వర్గం

|

May 31, 2022 | 11:55 AM

హిందూ పురాణాల ప్రకారం చిదంబరం అనేది శివుని ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాల కి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికి నిదర్శనమని భక్తుల నమ్మకం.

Chidambaram Temple: మళ్ళీ వివాదంలో చిదంబర నటరాజస్వామి సంపద.. ఆలయ సంపదపై ప్రభుత్వానికి హక్కులేదంటున్న దీక్షిత వర్గం
Chidambaram Nataraja Swamy
Follow us on

Chidambaram Temple: తమిళనాడులోని ప్రముఖ హిందూ క్షేత్రం శైవ సాంప్రదాయం లో శ్రీ నటరాజ స్వామి కొలువైన చిదంబరం. తాజాగా  చిదంబర నటరాజస్వామి ఆలయ సంపద వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆలయ సంపద ఫై పూర్తి వివరాలను వెల్లడించాలని దీక్షితులు వర్గానికి ఆ రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ (హెచ్‌ఆర్‌ అండ్‌ సీఈ) ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు చిదంబరం నటరాజ ఆలయానికి సంబంధించిన ఖాతాల వివరాలను తమ వద్ద ఉంచాలని కోరుతూ వారికి నోటీసులు పంపింది. ఆలయ ఆస్తులువివరాలను జూన్ 7 , 8 తేదీల్లో తెలిపాలని పేర్కొంది.

అయితే నటరాజస్వామి ఆలయ సంపద వివరాలు, ఆదాయం , ఖర్చు , కి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాలని నోటీసులను పంపించడంపై దీక్షితుల వర్గం తప్పుపడుతున్నాయి. నటరాజస్వామి ఆలయ సంపద ఫై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2014 సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆలయానికి సంబంధించిన పూర్తి హక్కులు దీక్షితులవేనని చెబుతున్నారు.  దేవాదాయ శాఖ ఉత్తర్వులను ఖండిస్తూ రాష్ట్రపతి , ప్రధానికి, రాష్ట్ర గవర్నర్ కి ఆలయ దీక్షితులు ఇప్పటికే ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. నటరాజస్వామీ ఆలయం విషయం లో ప్రభుత్వ ప్రమేయాన్ని తాము ఒప్పుకోమని చెప్పారు.  ఆలయ సంపద విషయంలో ప్రభుత్వంతో ఎంతటి పోరాటానీకైనా తాము సిద్ధమంటూ దీక్షితుల వర్గం హెచ్చరికలు జారీ చేశారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..