దిశా శాలియన్ కేసుతో సంబంధం లేదు, సూరజ్ పాంచోలీ

| Edited By: Pardhasaradhi Peri

Aug 23, 2020 | 6:13 PM

సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దివంగత దిశా శాలియన్ డెత్ కేసుతో తనకు సంబంధం లేదని బాలీవుడ్ నటుడు సూరజ్ పాంచోలీ స్పష్టం చేశాడు. తనకు లింక్ ఉందంటూ వస్తున్న వార్తలు, రూమర్లతో ఊపిరి ఆడనట్టు ఇబ్బంది పడుతున్నానని, ఇప్పటికైనా శ్వాస తీసుకోవాలని ఉందంటూ ఇన్ స్టాగ్రామ్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. అందులో ఒక్క పోస్టును తప్ప మిగిలినవాటినన్నింటినీ తొలగించాడు. ‘ ఐ నీడ్ టు బ్రీత్…సఫోకేటెడ్.. సి యూ ఇన్ స్టాగ్రామ్ హోప్ ఫుల్లీ విల్ […]

దిశా శాలియన్ కేసుతో సంబంధం లేదు, సూరజ్ పాంచోలీ
Follow us on

సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దివంగత దిశా శాలియన్ డెత్ కేసుతో తనకు సంబంధం లేదని బాలీవుడ్ నటుడు సూరజ్ పాంచోలీ స్పష్టం చేశాడు. తనకు లింక్ ఉందంటూ వస్తున్న వార్తలు, రూమర్లతో ఊపిరి ఆడనట్టు ఇబ్బంది పడుతున్నానని, ఇప్పటికైనా శ్వాస తీసుకోవాలని ఉందంటూ ఇన్ స్టాగ్రామ్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. అందులో ఒక్క పోస్టును తప్ప మిగిలినవాటినన్నింటినీ తొలగించాడు. ‘ ఐ నీడ్ టు బ్రీత్…సఫోకేటెడ్.. సి యూ ఇన్ స్టాగ్రామ్ హోప్ ఫుల్లీ విల్ సి యూ సమ్ డే వెన్ ది వరల్డ్ ఈజ్ బెటర్ ప్లేస్’  అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం సూరజ్ పాంచోలీ ఇన్స్ స్టాగ్రామ్ లో ఒకేఒక పోస్ట్ ఉంది. అదే..ఆరేళ్లుగా తాను ఓ  కోర్టు కేసుతో పోరాడుతున్నానంటూ పెట్టిన పోస్ట్..

2013 లో బాలీవుడ్ నటి జియా ఖాన్ సూసైడ్ కేసుతో తనకు సంబంధం ఉందని, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి తానే కారణమని నాడు వఛ్చిన వార్తలను ఈ పోస్టులో ప్రస్తావించాడు. ఆ కేసుకు సంబంధించి తనను నేరస్థుడు, హంతకుడు, ఎబ్యుసర్ గా  ఇలా నానా మాటలూ అన్నారని, కానీ తానేమీ రాక్షసుడిని కానని, నిర్దోషిగా నిరూపించుకుంటానని పేర్కొన్నాడు. అటు దిశా శాలియన్ తనకు తెలుసునని, అయితే కొన్నేళ్ల క్రితమే తాము దూరమయ్యామని సూరజ్ పాంచోలీ వెల్లడించాడు. సుశాంత్ మాజీ మేనేజర్ అయిన దిశా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.