Ahmedabad: సెల్ఫోన్కు బానిసైన రిటైర్డ్ ఆర్మీ అధికారి కొడుకు.. కోపంతో గన్తో కాల్చేసిన తండ్రి..
సెల్ఫోన్కు బానిసైన కొడుకు మాట వినటం లేదని, పైగా తనమీదకే తిరగబడ్డడానే కోపంతో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. గన్తో కొడుకును కాల్చేశాడు. ఈ ఘటన
Ahmedabad: మనుషుల్లో ఓపిక, సహనం నశించిపోతున్నాయి. క్షణికావేశంలో కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. సెల్ఫోన్కు బానిసైన కొడుకు మాట వినటం లేదని, పైగా తనమీదకే తిరగబడ్డడానే కోపంతో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. గన్తో కొడుకును కాల్చేశాడు. ఈ ఘటన గుజరాత్లోని కామ్రేజ్వన్ గ్రామంలో తీవ్ర సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్లోని కమ్రేజ్లోని వావ్ గ్రామానికి చెందిన చంద్ర దర్శన్ సొసైటీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి ధర్మేంద్ర ఓం ప్రకాష్..అతని కుమారుడు స్థానికంగా ఉన్న స్కూల్లోనే 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే బాలుడు విపరీతమైన సెల్పోన్ గేమ్స్కు అలవాటుపడ్డాడు. అతనికి మొబైల్ ఫోన్కు బానిసైన తన కొడుకును రిటైర్డ్ ఆర్మీ అధికారి పలుమార్లు మందలించాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కొడుకు తండ్రి తలపై వైపర్తో రక్తం వచ్చేలా కొట్టాడు. ఈ క్రమంలోనే కొడుకు మోచేతిపై ఓంప్రకాశ్ గన్తో కాల్చాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తండ్రీకొడుకులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి