సింహాం ఎక్కడున్నా..సింహామే…అన్నట్టుగా దాని ఠీవిని ప్రదర్శిస్తుంది. అలా..గుజరాత్ రాష్ట్రంలోని జునాఘడ్ పట్టణంలో సింహాలు రాజసం ప్రదర్శించాయి. జనావాసాల్లో రోడ్డుపైకి వచ్చిన సింహాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. గిర్నార్ వైల్డ్లైఫ్ శాంక్స్యూరీకి ఈ పట్టణం దగ్గరగా ఉండటంతో అడవిలోని సింహాలు పట్టణ వీదుల్లోకి చేరుకున్నాయి. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు భయంతో వణికిపోయారు. కొందరు ఈ విజువల్స్ని తమ సెల్ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో…ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది