Fire Accident: గేమింగ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం.. 24 మంది సజీవ దహనం.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
గుజరాత్ లోని రాజ్కోట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. TRP గేమింగ్ జోన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 24 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. 10 ఫైరింజన్లు, సిబ్బంది రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో TRP గేమింగ్ జోన్ పూర్తిగా తగలబడిపోయింది
గుజరాత్ లోని రాజ్కోట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. TRP గేమింగ్ జోన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 24 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. 10 ఫైరింజన్లు, సిబ్బంది రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో TRP గేమింగ్ జోన్ పూర్తిగా తగలబడిపోయింది. కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగింది. సమ్మర్ అందులోనూ వీకెండ్ కావడంతో గేమింగ్ సెంటర్కు చాలామంది చిన్నారులు వచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికైతే స్పష్టత లేదుగానీ.. గేమింగ్ సెంటర్ లోపల మాత్రం ఇంకా చాలామంది చిక్కుకున్నారన్న అనుమానాలున్నాయి. లోపలి నుంచి కాపాడండి అంటూ ఆర్తనాదాలు కూడా వినిపిస్తున్నాయి అంటున్నారు. గేమింగ్ సెంటర్లో సిలిండర్లు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి..
ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ , గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులు చేరుకున్నాయి. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు
The fire tragedy in Rajkot has saddened us all. In my telephone conversation with him a short while ago, Gujarat CM Bhupendrabhai Patel Ji told me about the efforts underway to ensure all possible assistance is provided to those who have been affected. @Bhupendrapbjp
— Narendra Modi (@narendramodi) May 25, 2024
#WATCH | Gujarat: A massive fire breaks out at the TRP game zone in Rajkot. Fire tenders on the spot. Further details awaited. pic.twitter.com/f4AJq8jzxX
— ANI (@ANI) May 25, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…