గణేష్‌ నిమజ్జనానికి ఐదుగురికే అనుమతి

కరోనా వైరస్‌ భారతీయ పండుగలపై ప్రభావాన్ని చూపింది. మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి పండుగను దేశ ప్రజలు ఇళ్లలోనే జరుపుకుంటూ వస్తున్నారు.

గణేష్‌ నిమజ్జనానికి ఐదుగురికే అనుమతి
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 3:39 PM

కరోనా వైరస్‌ భారతీయ పండుగలపై ప్రభావాన్ని చూపింది. మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి పండుగను దేశ ప్రజలు ఇళ్లలోనే జరుపుకుంటూ వస్తున్నారు. ఇక వచ్చే నెలలో రాబోతున్న గణేష్‌ ఉత్సవాలపై కూడా కరోనా ఎఫెక్ట్‌ పడింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో గణేష్‌ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గణేష్‌ ఉత్సవాలకు సంబంధించి కొన్ని నిబంధనలు పెడుతున్నాయి. ఈ క్రమంలో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ గణేష్‌ నిమజ్జనానికి సంబంధించి ముంబయివాసులకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

గణేష్‌ విగ్రహాల ఊరేగింపు మొదలు నిమజ్జనంలో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది. అలాగే మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీఎంసీ హెచ్చరించింది. ముంబయిలో కరోనా కేసులు ఇప్పటికే లక్షను దాటేయడం, కేసులు పెరుగుతూనే ఉండటంతో.. బీఎంసీ(బ్రిహాన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌) ఈ నిర్ణయం తీసుకుంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?