
రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న ఒక పోర్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును వివరించాడు. తాను 1981 నుండి ఇక్కడే కూలీగా పనిచేస్తున్నాను.. కానీ, గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జనసమూహాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రయాగ్రాజ్ స్పెషల్ 12వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ, సడెన్గా ఆ ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ 16వ నంబర్కు మార్చబడింది. దాంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ప్లాట్ఫామ్ 16 వైపు పరిగెత్తడం ప్రారంభించారు. దీని కారణంగా రెండు వైపుల నుండి వచ్చిన జనాలు ఒకరినొకరు ఢీకొంటూ తొక్కుకుంటూ తోసుకున్నారని చెప్పాడు. ప్రయాణికులు ఎస్కలేటర్లు, మెట్లపై పడిపోయారని కూలీ వివరించారు.
ఈ ఘటనలోనే చాలా మంది చనిపోయారు. మేము చనిపోయిన వారిని అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లాము. ప్లాట్ఫారమ్పై బూట్లు, బట్టలు చెల్లా చెదురుగా పడిపోవటం చూసి చలించిపోయామని చెప్పారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. 3-4 అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత ప్రజలను ఆసుపత్రికి తరలించారు.
#WATCH | Stampede at New Delhi railway station | A porter (coolie) at the railway station says “I have been working as a coolie since 1981, but I never saw a crowd like this before. Prayagraj Special was supposed to leave from platform number 12, but it was shifted to platform… pic.twitter.com/cn2S7RjsdO
— ANI (@ANI) February 16, 2025
రాత్రి తొక్కిసలాట చూసిన తర్వాత ఉదయం వరకు తాను ఎలాంటి ఆహారం తినలేకపోయానంటూ అతడు బాధగా చెప్పాడు. మూడు గంటల పాటు అక్కడి కూలీలంతా పోలీసుల కంటే ముందుగా స్పందించి ప్రజలకు సహాయం చేశామని చెప్పాడు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సెఫ్టీ స్టేషన్లో అగ్నిప్రమాదంగా భావించి..మూడు ఫైర్ ఇంజిన్లను పంపించారని చెప్పాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.