
బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్స, బంగ్లాదేశ్ జాతి పిత షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ వెళ్లిన మోదీ.. రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే సత్కిరా జిల్లాలోని ఈశ్వరిపూర్లో ఉన్న జశోరేశ్వరీ కాళీ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక శుక్రవారం ఢాకాలోని నేషనల్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన బంగ్లాదేశ్ నేషనల్ డే ఉత్సవాల్లో మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తన జీవితంలో ఈరోజు చాలా ముఖ్యమైనదని, ఈరోజు ఎన్నటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో తనను భాగస్వామిని చేసినందుకు బంగ్లాదేశ్కు కృతజ్ఞతలు తెలిపారు.