Parliament: రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే.. ఆమోదముద్ర వేసిన చైర్మన్ వెంకయ్య నాయుడు
Mallikarjun Kharge: రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యవహరించనున్నారు. ఖర్గేను నియమించాలని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు..
Mallikarjun Kharge : రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యవహరించనున్నారు. ఖర్గేను నియమించాలని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదముద్ర వేశారు. అయితే ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించిన గులాంనబీ ఆజాద్ పదవీ కాలం ఫిబ్రవరి 15 తో ముగిసింది. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేను ప్రతిపక్ష నేతగా నియమించాలంటూ కాంగ్రెస్ తాత్కలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉపరాష్ట్రపతి, చైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. దీంతో చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గేను నియమిస్తూ మంగళవారం ఆమోదముద్ర వేశారు. 16 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గే మొదటినుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఖర్గే గతంలో (2014-19) లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. 2019లో జరిగిన ఎన్నికల్లోఆయన ఓడిపోవడంతో.. మరలా కాంగ్రెస్ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది.
Also Read: