మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. భారీ ఎన్‌కౌంటర్‌‌లో 15 మంది మృతి.. మృతుల్లో అగ్రనేతలు..!

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లోని సింగ్భూం జిల్లా సరందా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్ధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్టు సమాచారం.

మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. భారీ ఎన్‌కౌంటర్‌‌లో 15 మంది మృతి.. మృతుల్లో అగ్రనేతలు..!
Jharkhand Encounter

Updated on: Jan 22, 2026 | 2:40 PM

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లోని సింగ్భూం జిల్లా సరందా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్ధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్టు సమాచారం.

ఆపరేషన్ కగార్‌లో భాగంగా పోలీసులు, భద్రతా దళాలు విస్తృత వేట మొదలుపెట్టారు. ఇందులో భాగంగా చోటానగరా ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు తరసపడ్డారు. దీంతో భద్రతా దళాలపైకి మావోయస్టులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. పోలీసుల ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మృతుల్లో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు పతిరామ్‌ మాంఝీ కూడా ఉన్నట్లు సమాచారం. ఆయనపై రూ.5 కోట్ల రివార్డు ఉంది. ఈ ఘటనలో చనిపోయిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..