జేఈఈ-నీట్ పరీక్షలు: మార్గదర్శకాలు విడుదల

జేఈఈ మెయిన్స్‌, నీట్ పరీక్షల షెడ్యూల్‌ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించిన విషయం తెలిసిందే.

జేఈఈ-నీట్ పరీక్షలు: మార్గదర్శకాలు విడుదల

Edited By:

Updated on: Aug 26, 2020 | 7:45 AM

JEE- NEET Exams Updates: జేఈఈ మెయిన్స్‌, నీట్ పరీక్షల షెడ్యూల్‌ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్‌, సెప్టెంబర్ 13న నీట్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సెప్టెంబర్ 27న జరగబోతున్నాయి. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దని, పరీక్షలను వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా ఆందోళన ఎక్కువవుతోంది. ఇదిలా ఉంటే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎన్‌టీఏ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాదు ఎగ్జామ్‌ సెంటర్‌ల సంఖ్యను పెంచింది.

మార్గదర్శకాలివే:
1. విద్యార్థుల్లో 99శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి సెంటర్‌నే ఇవ్వనున్నారు.
2. సెంటర్‌కి వచ్చే విద్యార్థులు కచ్చితంగా ముఖానికి మాస్క్‌లు, చేతికి గ్లౌజ్‌లు ధరించాల్సి ఉంటుంది. వాటర్ బాటిల్‌, శానిటైజర్ కూడా వెంట తీసుకురావాలి.
3.భౌతిక దూరం పాటించాలి.
4.అయితే ఎగ్జామ్‌ సెంటర్‌లోకి కేవలం అడ్మిట్ కార్డుని మాత్రమే అనుమతించనున్నారు.
5. సెంటర్‌ల వద్ద గుంపులను అరికట్టేందుకు విద్యార్థులకు వివిధ సమయాలను కేటాయించారు.
6.99.4 ఫారిన్‌హీట్‌ డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న విద్యార్థులకు ఐసోలేషన్‌ గదుల్లో ఉంచనున్నారు. అక్కడే డాక్యుమెంట్‌ వెరిఫికేషన్ చేయనున్నారు. ఇందుకోసం 15-20 నిమిషాల సమయం పట్టనుంది. ఆ లోపు వారి ఉష్ణోగ్రత తగ్గకపోతే.. ప్రత్యేక రూమ్‌లో వారికి పరీక్ష నిర్వహించనున్నారు.
7. పరీక్ష హాల్‌లోకి వెళ్లేముందు ప్రతి ఒక్కరు చేతులను శుభ్రపరచుకోవాలి.
8. పరీక్ష తరువాత ఒక్కొక్కరుగా బయటికి వెళ్లాలి.
9. మాస్క్‌, గ్లోవ్స్‌ని సెంటర్ బయట ఉన్న చెత్తబుట్టలో విధిగా పడేయాలి.

Read More:

ఎంపీ కేకేను బురిడీ కొట్టించే ప్రయత్నం.. వ్యక్తిపై కేసు నమోదు

జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..