
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. వన్ వెబ్కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు ఇస్రో శాస్త్రవేత్తలు.

ఎల్వీఎం-3 వాహకనౌక ద్వారా 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం నిర్వహించిన రిహార్సల్స్ విజయవంతం అయ్యాయి. దీంతో మార్చి 26వ తేదీన ఆదివారం రాత్రి ఉదయం గంటలకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది.

మొదటి విడతలో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు.

అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ను ప్రపంచం మొత్తానికి అందించే శాటిలైట్స్ను ఆదివారం ఇస్రో అంతరిక్షంలోకి పంపించబోతోంది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి 36 ఉపగ్రహాలతో కూడిన సముదాయాన్ని ప్రత్యేకంగా రూపొందించిన లాంచ్ వెహికల్ మార్క్ త్రీ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.

5,805 కేజీలు బరువు కలిగి ఉన్న 36 ఉపగ్రహాలను 450 కి.మీ. ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు.

36 వన్వెబ్ ఉపగ్రహాలతో కూడిన మొదటి బ్యాచ్ను గత ఏడాది అక్టోబర్ 23న శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించింది.