దుబాయ్ చేరుకున్న శిఖర్ ధావన్ వీడియో వైరల్

|

Aug 23, 2020 | 6:22 PM

ఐపీఎల్-2020 టోర్నికి ముందు భారత క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శిఖర్ ధావన్ వీడియో ఒకటి తెగ వైరల్ గా మారింది. వచ్చేనెల 19 నుంచి ఐపీఎల్-2020 యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు దుబాయ్ కూడా చేరుకున్నాయి.

దుబాయ్ చేరుకున్న శిఖర్ ధావన్ వీడియో వైరల్
Follow us on

ఐపీఎల్-2020 టోర్నికి ముందు భారత క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శిఖర్ ధావన్ వీడియో ఒకటి తెగ వైరల్ గా మారింది. వచ్చేనెల 19 నుంచి ఐపీఎల్-2020 యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు దుబాయ్ కూడా చేరుకున్నాయి. ఈ టోర్నీకోసం రెండు రోజుల క్రితమే చెన్నై, ముంబై జట్టు సభ్యులు దుబాయ్ లో మకాం వేశారు. నిన్ననే ఢిల్లీ తదితర జట్లకు చెందిన ఆటగాళ్లు దుబాయ్ పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యుడు శిఖర్ ధవన్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ‘ఐపీఎల్ ముందు క్వారంటైన్’ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చాడు.ఈ వీడియోలో శిఖర్ హోటల్ రూంలోకి వెళ్లి తలగడ వేసుకుని పడుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాగ్రౌండ్‌లో ‘సారా జహా సోగయా’ అనే హిందీ పాట వినిపిస్తోంది. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ స్పందించాడు. భలే నటిస్తున్నావంటూ కితాబిచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంర్నెట్ లో తెగ వైరల్ గా మారింది.