దసరా ఉత్సవాలు: బిడ్డలను ఎత్తుకున్న ‘దుర్గమ్మ’.. మొత్తానికి ఇంటికి చేరుకుంది

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా మండపాలను ఏర్పాటు చేశారు.

దసరా ఉత్సవాలు: బిడ్డలను ఎత్తుకున్న 'దుర్గమ్మ'.. మొత్తానికి ఇంటికి చేరుకుంది
Follow us

| Edited By:

Updated on: Oct 17, 2020 | 1:10 PM

Migrant Worker Statue: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా మండపాలను ఏర్పాటు చేశారు. ఇక దసరా ఉత్సవాలు అద్భుతంగా జరిగే పశ్చిమ బెంగాల్‌లో కొన్ని మండపాలను వినూత్నంగా తయారుచేశారు. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌లో వలస కార్మికుల పరిస్థితిని, వర్కర్లు చేసిన సేవలను గుర్తిస్తూ కొన్ని మండపాలు వెలిశాయి.

అందులో భాగంగా బెహలాలోని బరిషా క్లబ్‌లో రింటు దాసు అనే ఓ ఆర్టిస్ట్‌.. తన పిల్లలతో ఉన్న ఓ వలస కార్మికురాలు విగ్రహాన్ని తయారు చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ”లాక్‌డౌన్ సమయంలో ఓ మహిళ తన నలుగురు పిల్లలను ఎలాంటి భయం లేకుండా తీసుకెళ్తుండటం చూశాను. దాన్ని చూసే ఈ విగ్రహాన్ని చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది” అని అన్నారు. ఇక మరికొన్ని మండపాల్లో వలస కార్మికులు, కరోనా సమయంలో సేవ చేసిన వారిని గుర్తిస్తూ విగ్రహాలు తయారు చేశారు. ఈ విగ్రహాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారగా.. పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో చాలా మంది వలస కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారిలో కొంతమంది ఎలాగోలా తమ స్వగృహాలకు చేరుకున్నప్పటికీ, మరికొందరు మాత్రం మార్గమధ్యమంలో మరణించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అందరి చేత కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే.

Read More:

‘మహా సముద్రం’లో మరో హీరోయిన్ ఎవరంటే..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కి ‘రాధేశ్యామ్’‌ టీమ్‌ బర్త్‌డే కానుక.. ఏంటో తెలుసా..!

Latest Articles
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..