Viral: జైల్లోని ఖైదీలను కలిసేందుకు వచ్చిన బంధువులు.. వారు బుర్ఖాలలో దాచింది చూసి అధికారులు షాక్
బుర్ఖాల మాటున గమ్మత్తు వ్యవహారం. వారి దాచి తెచ్చింది చూసి.. జైలు అధికారులు ఒక్కసారిగా స్టన్ అయ్యారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి
మత్తు మనుషుల్ని ఎంతలా బానిసల్ని చేస్తుందో చెప్పడానికి ఈ ఘటన ఉదాహారణ. వారందరూ ఖైదీలు. వివిధ నేరాల కింద జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వారిలో కొందరికి గంజాయి అలవాటు ఉంది. చిప్పకూడు తింటున్నా కూడా వారి బుద్ది మారలేదు. గంజాయి లేకుండా ఉండలేకపోయారు. ఇందుకోసం బయట ఉన్న తమవాళ్లను కాంటాక్ట్ చేశారు. లోపలకి గంజాయి పంపాల్సిందిగా కోరారు. ఇది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారమే. అయినప్పటికీ బయట ఉన్నవాళ్లు ఓ పథకం రచించారు. బుర్ఖా ధరించిన ముస్లిం మహిళల ద్వారా ఈ పని సులువుగా అవుతుందని భావించారు. భారీ డబ్బు ఆశచూపి వారిని ట్రాప్ చేశారు. ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు పేరుతో వీరికి గంజాయి ఇచ్చి లోనికి పంపేవారు. అలా కొంతకాలం ఈ వ్యవహారం గుట్టుగానే సాగింది. కానీ ఇప్పుడు బట్టబయలైంది.
ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో జైలులో గంజాయి సరఫరా చేస్తున్న షబ్నం, మదీనా, షహనాజ్, షబానా అనే నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలు తమ బుర్కాలలో గంజాయి దాచిపెట్టి జైలులోని ఖైదీలుగా అందజేస్తున్నట్లు గుర్తించారు. తాజా తనిఖీలలో వారి బుర్కాలలో దాచి ఉంచిన 4 కిలోల గంజాయిని గుర్తించారు. జైలులో ఇమ్రాన్, ఇస్మాయిల్ అనే ఇద్దరు ఖైదీలు ఈ గంజాయిని తోటి ఖైదీలకు విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. భారతీయ శిక్షాస్మృతిలోని ఎన్డీపీఎస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై బుర్ఖా ధరించి వచ్చే మహిళలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జైలులో ఉన్న మహిళా సిబ్బందిని కోరినట్లు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
आजमगढ जेल में “बुर्का ” की आड़ में “सब्जी” की जगह “गांजा” की सप्लाई करते गिरफ्तार!
नाम- शबनम, शबाना, शहनाज और मदीना।https://t.co/4ESh9yBwmD pic.twitter.com/ASzK2228RQ
— Sudhir Mishra ?? (@Sudhir_mish) January 19, 2023
జైలులో గంజాయి బ్యాచ్ నెట్వర్క్ పెద్దది కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర నిందితుల నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నామని.. మరొకరు ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా నిందితులపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తామని జైలు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..