Flight tickets: విమానమెక్కాలంటే అవుతాయి జేబులు ఖాళీ.. టిక్కెట్ల ఛార్జీలు ఎంతగా పెరుగుతాయంటే..!

|

Aug 13, 2021 | 8:00 PM

డొమెస్టిక్ విమాన ప్రయాణికులపై త్వరలో మరింత భారం పడనుంది. విమాన ఛార్జీల కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మరోసారి పెంచింది. వీటిని 9.83 నుంచి 12.82 శాతం వరకు

Flight tickets: విమానమెక్కాలంటే అవుతాయి జేబులు ఖాళీ.. టిక్కెట్ల ఛార్జీలు ఎంతగా పెరుగుతాయంటే..!
Flight tickets
Follow us on

Airfares: డొమెస్టిక్ విమాన ప్రయాణికులపై త్వరలో మరింత భారం పడనుంది. విమాన ఛార్జీల కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మరోసారి పెంచింది. వీటిని 9.83 నుంచి 12.82 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలోనే ఈ పరిమితులను పెంచినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. దేశీయ విమాన ఛార్జీల పరిమితులు పెంచడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

తాజా పెంపుతో 40 నిమిషాల లోపు ప్రయాణ సమయం ఉండే ఫ్లైట్ టికెట్‌ ధర కనిష్ఠ పరిమితి 2,600 రూపాయల నుంచి 2,900లకు పెరిగింది. ఇదే ప్రయాణ సమయానికి గరిష్ఠ పరిమితిని 12.82శాతం పెంచడంతో 8,800 రూపాయలకు చేరింది. ఇక 40 నుంచి 60 నిమిషాల ప్రయాణ సమయం ఉండే ఫ్లైట్ టికెట్ ధర కనిష్ఠ పరిమితి 3,300 రూపాయలుండగా ఇప్పుడు 3,700లకు పెరిగింది. గరిష్ఠ పరిమితిని 11 వేల రూపాయలకు పెంచారు.

60 నుంచి 90 నిమిషాల ప్రయాణ సమయానికి టికెట్‌ కనిష్ఠ పరిమితి 4,500 రూపాయలుగాను.. గరిష్ఠ పరిమితిని 13 వేల 200 రూపాయలుగాను ఖరారు చేశారు. 90 నుంచి 120 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి 4,700 రూపాయలుండగా.. ఇప్పుడు 5,300 రూపాయలకు చేరింది. గరిష్ఠ పరిమితిని 12.3శాతం పెంచారు. 120 నుంచి 150 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి 6,100 రూపాయలుండగా.. ఇప్పుడు 6,700 రూపాయలకు పెరిగింది.

ఇక, ఫ్లైట్ టిక్కెట్ల గరిష్ఠ పరిమితిని 12.42శాతం పెంచారు. 150 నుంచి 180 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి 7,400 రూపాయలుండగా.. ఇప్పుడు 8,300 లకు చేరింది. గరిష్ఠ పరిమితిని 12.74శాతం పెంచారు. 180 నుంచి 210 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి 8,700 రూపాయలుండగా.. ఇప్పుడు 9,800లకు పెరిగింది. గరిష్ఠ పరిమితిని 12.39శాతం పెంచారు.

Read also: Lokesh: ‘అది ఇంటి గొడ్డలేన‌ని.. సొంతింటి వేట‌ కొడ‌వ‌లే వివేకాని వేటాడింద‌ని స్పష్టం అవుతోంది’: నారా లోకేష్