లోయలో కొనసాగుతున్న ఉగ్రవేట.. మసీదులో నక్కిన ఉగ్రవాదులు..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. గత మూడు నెలలుగా నిత్యం జమ్ముకశ్మీర్లోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంటుంది.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. గత మూడు నెలలుగా నిత్యం జమ్ముకశ్మీర్లోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంటుంది. దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం చేస్తున్న ప్రయత్నాలకు మన భారత సైనికులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. తాజాగా గురువారం నాడు మరోసారి లోయలో ఉగ్రవాదుల అలజడి కలకలం రేగింది. సౌత కశ్మీర్లోని షోపియాన్ జిల్లా మునాంద్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాల కదలికలు గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సైన్యం.. ఎదురుకాల్పులు ప్రారంభించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
An encounter has started in Munand area of Shopian in Jammu and Kashmir. Police and security forces are carrying out the operation. Further details shall follow: J&K Police
— ANI (@ANI) June 18, 2020
ఇక మరో ఎన్కౌంటర్ అవంతిపోరా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పామ్పోరె ప్రాంతంలోని మీజ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందడంతో.. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన దళాలు.. ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు సమీపంలోని మసీదులోకి చొరబడ్డాడని గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
#UPDATE Terrorist entered a nearby mosque to take refuge. Joint Operation in progress: Indian Army https://t.co/5p88NTJmSW
— ANI (@ANI) June 18, 2020