
మన దేశ వ్యూహాత్మక సమాచార నెట్వర్క్లను సైబర్ అటాక్స్ నుంచి కాపాడి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బలోపేతం చేసే దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఒక కీలక మైలురాయిని సాధించింది. అత్యంత సురక్షితమైన, ఫైబర్ ఆధారిత క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) అనే సిస్టమ్కు సంబంధించిన మిలిటరీ క్షేత్ర స్థాయి పరిశీలనలను డీఆర్డీఓ సక్సెస్ ఫుల్గా పూర్తి చేసింది.
గతంలో ల్యాబ్ స్థాయిలో చేసిన ప్రయోగాలు, సాధించిన అనుభవాలను ఆధారంగా చేసుకొని డీఆర్డీఓ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశీలను విజయవంతం చేసింది.. బెంగళూరుకు చెందిన ప్రముఖ పరిశ్రమ భాగస్వామి తక్బిట్ ల్యాబ్స్తో అనే సంస్థతో కలిసి డీఆర్డీవో ఈ అధునాతన సిస్టమ్ను రూపొందించింది. కీలకమైన జాతీయ కమ్యూనికేషన్ నెట్వర్క్లకు గట్టి భద్రత కల్పించేలా ఈ వ్యవస్థను తీర్చిదిందిం.
క్వాంటం యుగంలో సరికొత్తగా దూసుకొస్తున్న సైబర్ ముప్పుల నుండి దేశ రక్షణ, సమాచార వ్యవస్థలను కాపాడుకోవడానికి ఈ సాంకేతికత మనకు ఎంతగానో ఉపయోగపడనుంది. పూర్తిగా భారతదేశంలోనే రూపొందించబడిన ఒక భారీ స్థాయి, మల్టీ-హాప్ క్వాంటం నెట్వర్క్ల స్థాపనకు ఈ విజయం బలమైన పునాది వేసిందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇందుకు సంబంధించిన పోస్ట్ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.