కోవిడ్ నివారణకు ‘అప్పడం’ బెస్ట్ అన్న కేంద్ర మంత్రికి పాజిటివ్

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ సైతం కోవిడ్-19 బారిన పడ్డారు. రెండు సార్లు టెస్ట్ చేయించుకోగా ఆయనకు రెండో సారి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయన నిన్న  ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.

కోవిడ్ నివారణకు అప్పడం బెస్ట్ అన్న కేంద్ర మంత్రికి పాజిటివ్

Edited By:

Updated on: Aug 09, 2020 | 10:29 AM

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ సైతం కోవిడ్-19 బారిన పడ్డారు. రెండు సార్లు టెస్ట్ చేయించుకోగా ఆయనకు రెండో సారి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయన నిన్న  ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, తనతో కాంటాక్ట్ లో ఉన్నవారంతా టెస్ట్ చేయించుకోవాలని అర్జున్ రామ్ మేఘ్ వాల్ కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన సన్నిహితులు  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా-కోవిడ్ నివారణకు అప్పడాలు బాగా పని చేస్తాయని, వాటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వ్యాఖ్యానించి ఆయన అందరిలో నవ్వులు పూయించారు.  మరీ ముఖ్యంగా ‘భా బీజీ  అప్పడాలు’ అంటూ వాటికి ప్రమోషన్ కల్పిస్తున్నట్జు చేతిలో వీటిని పట్టుకుని ఈ బ్రాండుకి పబ్లిసిటీ ఇచ్చినంత పని చేశారు.

ఎయిమ్స్ లో ఈ మంత్రిగారికి అన్ని టెస్టులు జరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు. ఈయన  పార్లమెంటరీ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us