సుశాంత్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ బృందంతో బాటు ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం శనివారం ముంబైలోని అతని ఇంటికి చేరుకుంది. ఈ బృందం వెంట సుశాంత్ సోదరి మీతు సింగ్, కేర్ టేకర్ నీరజ్ సింగ్, కుక్ కేశవ్, సుశాంత్ ఫ్రెండ్ సిధ్ధార్త్ పితాని ఉన్నారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం ఇక్కడ క్రైమ్ సీన్ రీ-కంస్ట్రక్ట్ చేయనుంది. అటు-నార్కోటిక్స్ కంట్రోల్ బృందం అరెస్టు చేసిన శామ్యూల్ మిరందా, షోవిక్ చక్రవర్తిలను ఈ సంస్థ కోర్టుకు తీసుకువచ్చింది. వీరిని అయిదు రోజుల నుంచి ఎనిమిది రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది.