సీఏఏని త్వరలో అమలు చేస్తాం, బీజేపీ చీఫ్ జేపీ. నడ్డా

| Edited By: Pardhasaradhi Peri

Oct 19, 2020 | 7:39 PM

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ని త్వరలో అమలు చేస్తామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు. కోవిడ్-19 కారణంగా దీని అమలులో జాప్యం జరిగిందన్నారు. సీఏఏ అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజలందరికీ దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో పార్టీ సంస్థాగత వ్యవహారాల పర్యవేక్షణకు ఆయన సోమవారం ఈ జిల్లాను సందర్శించారు. వచ్ఛే ఏడాది బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడే బీజేపీ ఈ […]

సీఏఏని త్వరలో  అమలు చేస్తాం, బీజేపీ చీఫ్ జేపీ. నడ్డా
Follow us on

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ని త్వరలో అమలు చేస్తామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు. కోవిడ్-19 కారణంగా దీని అమలులో జాప్యం జరిగిందన్నారు. సీఏఏ అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజలందరికీ దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో పార్టీ సంస్థాగత వ్యవహారాల పర్యవేక్షణకు ఆయన సోమవారం ఈ జిల్లాను సందర్శించారు. వచ్ఛే ఏడాది బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడే బీజేపీ ఈ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది.