Watch: పిడుగుపాటుకు 14 మంది మృతి.. మరో 12మందికి గాయాలు

Updated on: Jun 17, 2025 | 9:54 PM

బక్సర్ జిల్లాలో నలుగురు, పశ్చిమ చంపారన్‌లో ముగ్గురు, కతిహార్ లో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. సీతామర్హి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో నలుగురు మహిళలు సహా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. పిడుగు పాటుకు చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా పరిహారం అందించాలని సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

బీహార్‌లో పిడుగులతో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతిచెందారు. బక్సర్ జిల్లాలో నలుగురు, పశ్చిమ చంపారన్‌లో ముగ్గురు, కతిహార్ లో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. సీతామర్హి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో నలుగురు మహిళలు సహా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. పిడుగు పాటుకు చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా పరిహారం అందించాలని సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

Published on: Jun 17, 2025 09:52 PM