
అస్సాంలోని నుమాలిగఢ్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక గజరాజును అటవీ అధికారులు అత్యంత సమర్థవంతంగా రక్షించి, దానికి పునర్జన్మ ప్రసాదించారు. మెడకు భారీ టైరు ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న ఒక ఏనుగును గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది, తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, నిపుణులైన బృందంతో కలిసి ఏనుగు మెడలోని టైరును సురక్షితంగా తొలగించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఆ మూగజీవం ఆ తర్వాత సంతోషంగా తన గుంపులో తిరిగి కలిసిపోయింది. ఈ సంఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. మనిషైనా, మూగజీవమైనా తమ రాష్ట్రంలో ఎవరూ ఆపదలో ఉండకూడదన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ ఘటనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఏనుగును సహాయక బృందాలు కాపాడిన వీడియోను ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేస్తూ, అటవీ అధికారుల కృషిని ప్రశంసించారు. ఈ సంఘటన వన్యప్రాణుల సంరక్షణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుంది.
इंसान हो या जानवर, असम में कोई भी पीड़ा में नहीं रहेगा।
नुमालीगढ़ में एक हाथी के गले में Tyre फँसा हुआ था, जो उसके जीवन के लिए एक बहुत बड़ी चुनौती थी।
हमने तुरंत एक्शन लिया और उसके गले से टायर को निकाला, जिससे उसकी जान भी बची और वह अपने झुंड के साथ फिर जुड़ सकी। https://t.co/s2IodU6W7F
— Himanta Biswa Sarma (@himantabiswa) September 10, 2026