కరోనా బారిన పడ్డ 20 వేల మంది అమెజాన్‌ ఉద్యోగులు

|

Oct 02, 2020 | 11:36 AM

కరోనా వైరస్‌ తమ ఉద్యోగులకు సోకకుండా ఉండేందుకు ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.. అయినప్పటికీ ఆ వైరస్‌ బారిన సుమారు 20 వేల మంది ఉద్యోగులు పడ్డారు..

కరోనా బారిన పడ్డ 20 వేల మంది అమెజాన్‌ ఉద్యోగులు
Follow us on

కరోనా వైరస్‌ తమ ఉద్యోగులకు సోకకుండా ఉండేందుకు ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.. అయినప్పటికీ ఆ వైరస్‌ బారిన సుమారు 20 వేల మంది ఉద్యోగులు పడ్డారు.. ఈ విషయాన్ని అమెజాన్‌ సంస్థే ప్రకటించింది.. అయితే అమెజాన్‌ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే కరోనా పాజిటివ్‌ల రేటు తక్కువే! 1.37 మిలియన్‌ల ఫ్రంట్‌లైన్ కార్మికులతో పాటు యునైటెడ్ స్టేట్స్‌లోని హోల్ ఫుడ్స్ మార్కెట్, కిరాణా దుకాణాల్లో ఉద్యోగులు పని చేస్తున్నారు.. దాదాపు 650 సైట్ల ద్వారా రోజుకు 50 వేల కరోనా పరీక్షలను అమెజాన్‌ నిర్వహించింది.. కరోనా పట్ల ఉద్యోగులను అప్రమత్తం చేయడానికి అమెజాన్‌ ఎంతో కష్టపడింది.. ఎప్పుడైతే కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంది అమెజాన్‌ సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచ్‌లలోని ఉద్యోగుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంది.. నమోదైన ప్రతి కొత్త కేసును తెలుసుకుంది.. హోల్‌ ఫుడ్స్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగుల రేటు అమెరికా జనాభాకు సమానంగా ఉంటుంది.. ఇందులో పాజిటివ్‌ కేసుల సంఖ్య 33 వేలు ఉండవచ్చని అమెజాన్‌ తెలిపింది. ఇంత చేస్తున్నా తమపై కొందరు విమర్శలు చేస్తున్నారని అమెజాన్‌ తెలిపింది.. కరోనా సోకిన కొంతమంది తమ ఉద్యోగులు వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదని అమెజాన్‌ పేర్కొంది.. మొత్తంగా ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో అమెజాన్‌ చాలా శ్రద్ధ తీసుకుంటోంది..