Viral: భూమిని తవ్వతుండగా గట్టిగా వినిపించిన శబ్ధం.. ఏంటా అని వెలికితీయగా అద్భుతం

గ్రామంలోని కూలీలు రోజూలానే తమ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ చోట గడ్డపారతో తవ్వుతుండగా.. అరుదైన విగ్రహం బయల్పడింది.

Viral: భూమిని తవ్వతుండగా గట్టిగా వినిపించిన శబ్ధం.. ఏంటా అని వెలికితీయగా అద్భుతం
Representative Image

Updated on: Jul 28, 2022 | 8:53 PM

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బుద్గామ్‌ జిల్లా(Budgam district)లో 2 పురాతన శిల్పాలు బయటపడ్డాయి. అందులో ఒకటి  విష్ణుమూర్తి విగ్రహం అని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నిర్ధారించింది. వివరాల్లోకి వెళ్తే.. బుద్గామ్‌లోని గుడ్‌సథూ గ్రామం(Gudsathoo village)లోని వ్యక్తులు ఓ స్థలంలో తవ్వకాలు జరుపుతుతండగా.. ఓ శిల్పం కనిపించింది. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిల్పాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు.  ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ బృందాన్ని పిలిపించి విగ్రహాన్ని పరిశీలించగా,  ఆ శిల్పం విష్ణుమూర్తిది అని తేలింది. ఈ విగ్రహం దాదాపు 9వ శతాబ్దానికి చెందినదని.. దాదాపు 1,200 సంవత్సరాల నాటిదని వారు ఒక నిర్ధారణకు వచ్చారు.  ఈ శిల్పం మూడు తలలతో.. నాలుగు చేతులతో ఉంది. విగ్రహం కుడి చేయి ఎగువ భాగంలో కమలం ఉంది. అదే విధంగా బుద్గాంలోని ఖాగ్ ప్రాంతంలో మరో శిల్పాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ శిల్పం పంచముఖ శకలమని అధికారులు తెలిపారు. ఈ రెండు శిల్పాలను కాశ్మీర్‌లోని  ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ బేగ్‌కు అందజేసినట్లు బుద్గామ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తాహిర్ సలీమ్ ఖాన్ తెలిపారు. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us