రేఖాజీ కోవిడ్ టెస్ట్ చేయించుకోండి.. ముంబై మేయ‌ర్ విన‌తి

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి రేఖను క‌రోనా టెస్ట్ చేయించుకోవాల‌ని కోరారు ముంబై మేయ‌ర్ కిషోర్ ఫ‌డ్నేక‌ర్‌. రేఖ బంగ్లా `సీ స్ప్రింగ్స్`లోని ఓ సెక్యూరిటీ గార్ట్‌కి క‌రోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 12న బాంద్రాలోని నటి రేఖ బంగ్లాకు..

రేఖాజీ కోవిడ్ టెస్ట్ చేయించుకోండి.. ముంబై మేయ‌ర్ విన‌తి
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 11:40 AM

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి రేఖను క‌రోనా టెస్ట్ చేయించుకోవాల‌ని కోరారు ముంబై మేయ‌ర్ కిషోర్ ఫ‌డ్నేక‌ర్‌. రేఖ బంగ్లా `సీ స్ప్రింగ్స్`లోని ఓ సెక్యూరిటీ గార్ట్‌కి క‌రోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 12న బాంద్రాలోని నటి రేఖ బంగ్లాకు సీల్ వేశారు బీఎంసీ అధికారులు. అలాగే బంగ్లా ఉన్న ఏరియాను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆ తర్వాత నటి రేఖను కూడా అధికారులు కోవిడ్ టెస్ట్ చేసుకోవాలని కోరగా.. ఆమె నిరాకరించింది. అయితే ఇక లాభం లేదని డైరెక్ట్‌గా ముంబై మేయరే రంగంలోకి దిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రేఖాజీ పెద్ద సెల‌బ్రిటీ. ఆమెకు ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తే అభిమానులు త‌ట్టుకోలేరు. అందుకే రేఖ వెంట‌నే టెస్టులు చేయించుకోవాల‌ని కోరుతున్నాం. బీఎంసీ ల్యాబుల్లోనే కాదు… ఏ ప్రైవేట్ ఆసుప‌త్రిలోనైనా ఆమె టెస్టులు చేయించుకోవ‌చ్చు. ఆమె క్షేమాన్ని మేం కాంక్షిస్తున్నాం“ అని మేయ‌ర్ కిషోర్ ఫ‌డ్నేక‌ర్ ప్ర‌క‌ట‌న చేశారు. మరి దీనిపై నటి రేఖ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read More:

టీటీడీ అనుబంధ ఆలయాల్లో కలకలం పుట్టిస్తోన్న కరోనా..

బ్రేకింగ్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి