‘టిక్ టాక్ ‘ తరఫున వాదించదలచుకోలేదు’.. ముకుల్ రోహ్తగి

ప్రభుత్వం బ్యాన్ చేసిన టిక్ టాక్ తరఫున గానీ, మరే  ఇతర చైనీస్ యాప్ ల తరఫునగానీ తాను సుప్రీంకోర్టులో వాదించదలచుకోలేదని మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు మాజీ అడ్వొకేట్ కూడా..

'టిక్ టాక్ ' తరఫున వాదించదలచుకోలేదు'.. ముకుల్ రోహ్తగి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2020 | 6:14 PM

ప్రభుత్వం బ్యాన్ చేసిన టిక్ టాక్ తరఫున గానీ, మరే  ఇతర చైనీస్ యాప్ ల తరఫునగానీ తాను సుప్రీంకోర్టులో వాదించదలచుకోలేదని మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు మాజీ అడ్వొకేట్ కూడా అయిన ముకుల్ రోహ్తగి వెల్లడించారు. టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ యాప్ ల మీద ప్రభుత్వం బ్యాన్ విధించింది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. కాగా ఈ బ్యాన్ తాత్కాలికమేనని, సంబంధిత అధినేతలు తమ వివరణను ఇచ్చుకునేందుకు అవకాశం ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. అటు-ఈ ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకుంటామని, తమ క్లారిటీని స్పష్టం చేసేందుకు ప్రభుత్వ వాటాదారులతోను, ఆయా ఏజన్సీలతోను సంప్రదింపులు జరుపుతామని టిక్ టాక్ యాజమాన్యం తెలిపింది. ఇలా ఉండగా.. ఈ యాప్ సహా ఇతర చైనీస్ యాప్ లపై సర్కార్ నిషేధం విధించడం పట్ల పలువురు సెలబ్రిటీలు, విద్యావేత్తలు, ఆర్టిస్టులు, ఇతర రంగాల వారు లోలోన అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ..   చైనా సేనల దాడిలో 20 మంది భారత సైనికులు మరణించడంతో.. ఈ బ్యాన్ సరైన చర్యే అని భావిస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సైనిక స్థాయిలో జరుగుతున్న చర్చలు నామమాత్రంగా సాగుతున్నాయి.