మహేశ్-పరుశురామ్ మూవీకి అదిరిపోయే టైటిల్..!
సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మే 31న ఈ ఫిల్మ్ లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్ ను కూడా మూవీ యూనిట్ ఫైనల్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. “సర్కారీ వారి పాట” అనే వినూత్న టైటిల్ తో మహేశ్ మూవీ రాబోతున్నట్టు తెలుస్తుంది. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేశ్ […]
సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మే 31న ఈ ఫిల్మ్ లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్ ను కూడా మూవీ యూనిట్ ఫైనల్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. “సర్కారీ వారి పాట” అనే వినూత్న టైటిల్ తో మహేశ్ మూవీ రాబోతున్నట్టు తెలుస్తుంది.
తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేశ్ కొత్త సినిమా స్టార్ట్ చెయ్యడమే కాకుండా టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. కియారా అద్వానీ మరోసారి ఈ చిత్రంలో మహేశ్ కు జోడీగా నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తారని వార్తలు వినిపించినా..మహేశ్ రిక్వెస్ట్ తో తమన్ ఫైనలయ్యాడని టాక్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేయనున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో మంచి విజయాన్ని అందుకుని జోష్ లో ఉన్నన మహేష్.. నెక్ట్స్ మూవీ వంశీపైడిపల్లి దర్శకత్వంలో చేస్తాడని అందరూ గెస్ చేశారు. ఆ రకంగానే చర్చలు కూడా జరిగాయి. కానీ కథ నచ్చకపోవడంతో చివరి నిమిషంలో మహేష్ పరుశురాం వైపు మొగ్గు చూపాడు. ‘గీత గోవిందం’ వంటి భారీ హిట్ తరువాత పరుశురాం దాదాపు ఏడాదిన్నర పైగా ఖాళీగా ఉండటం గమనార్హం. ఆయన వెయిటింగ్ కు తగ్గట్టుగా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం అభించింది .