మహారాష్ట్రలో కొత్తగా 2,933 కరోనా కేసులు..!

మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకు పెరగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం కొత్తగా 2,933 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 77,793కు చేరుకుంది. ఒక్క రోజే 123 మంది కరోనాతో మృతి.

మహారాష్ట్రలో కొత్తగా 2,933 కరోనా కేసులు..!
Follow us

|

Updated on: Jun 04, 2020 | 8:56 PM

మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకు పెరగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం కొత్తగా 2,933 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 77,793కు చేరుకుంది. ఇవాళ ఒక్క రోజే 123 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,710కి చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో కేవలం ముంబై నగరంలో1,442 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ముంబైలో ఇప్పటివరకు 44,704 కేసులు నమోదయ్యాయి. ముంబైలో కరోనాతో 48 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,465కు చేరుకుందని మహారాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుందండంతో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.