
విహార యాత్రలను ఇష్టపడే చాలా మంది వ్యక్తులు తమ సెలవు రోజులనుఁ ద్వీపంలో గడపాలని ప్లాన్ చేస్తారు. ద్వీపం అంటే మాల్దీవుల మాత్రమే కాదు. మన భారత దేశంలో కూడా అందమైన ద్వీప ప్రాంతాలు ఉన్నాయి. విహారయాత్ర కోసం ఈ సుందర ద్వీపాన్ని సందర్శించవచ్చు. ఈ రోజు మనం ఈ ప్రదేశాల గురించితెలుసుకుందాం..

హేవ్లాక్ ద్వీపం అండమాన్లో ఉంది. ప్రపంచంలోని కొన్ని అత్యుత్తమ బీచ్ల ఒకటి. ఇది గొప్ప పర్యాటక ప్రదేశం. సముద్రం ఒడ్డున కూర్చుని నీలి ఆకాశం క్రింద నీలి నీటిని చూస్తుంటే.. అదొక అనుభవం. ఖచ్చితంగా మీ ఒత్తిడిని దూరం చేస్తుంది.

ముంబైకి వెళ్లినప్పుడు ఎలిఫెంటా ద్వీపాన్ని సందర్శించడం మర్చిపోవద్దు. ఇది ముంబై హార్బర్ లోని ఈశాన్య దిశలో ఉంది. పురాతన భారతీయ అందాల దృష్ట్యా, యునెస్కో ఈ రాక్-కట్ అద్భుతాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది.

నేత్రాణి ద్వీపం కర్ణాటకలో ఉంది. దీనిని పావురం ద్వీపం అని కూడా అంటారు. పదునైన రాళ్ళతో ఈ అందమైన ద్వీపం పర్యాటకులను ఖచ్చితంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ మీరు విదేశాలలో నివసిస్తున్న అనుభూతిని పొందుతారు. స్కూబా డైవింగ్ కు ప్రసిద్ధి

గోవాలో పర్యటనలో దివార్ ద్వీపాన్ని సందర్శించడం మర్చిపోవద్దు. ఇలాంటి ద్వీపం భారతదేశంలో మరెక్కడా కనిపిస్తుంది. ఈ ద్వీపం కూడా మాల్దీవులలో ఉన్న అనుభూతిని ఇస్తుంది.