
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక రక్తపోటు. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు, ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చలి కారణంగా మన రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల గుండె రక్తమును పంప్ చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. దీనిని సకాలంలో నియంత్రించకపోతే గుండె, మూత్రపిండాలు మరియు మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు స్వామి రామ్దేవ్ రక్తపోటును సహజంగా తగ్గించుకోవడానికి కొన్ని అద్భుతమైన యోగాసనాలను సూచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ ఆసనం వేయడం వల్ల ఛాతీ కండరాలు వ్యాకోచించి, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. చలికాలంలో కుంచించుకుపోయే రక్త నాళాలను ఇది సడలిస్తుంది. తద్వారా గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
మండూకాసనం కడుపు భాగంలోని అంతర్గత అవయవాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గినప్పుడు రక్తపోటు కూడా ఆటోమేటిక్గా నియంత్రణలోకి వస్తుంది.
మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో మానసిక ఒత్తిడి పెరగడం వల్ల కూడా బిపి పెరుగుతుంది. శశాంకాసనం సాధన చేయడం వల్ల హృదయ స్పందనలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది.
శరీర సమతుల్యతను కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కండరాలను చురుగ్గా ఉంచి, శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. క్రమం తప్పకుండా దీనిని ప్రాక్టీస్ చేయడం వల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకోవచ్చు.
యోగాతో పాటు ఈ అలవాట్లు కూడా రక్తపోటును అదుపులో ఉంచుతాయి
ఉప్పు తగ్గించండి: ఆహారంలో ఉప్పు పరిమాణం ఎంత తక్కువగా ఉంటే బిపి అంత కంట్రోల్లో ఉంటుంది.
నడక: రోజూ కనీసం 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం లేదా నడక తప్పనిసరి.
నిద్ర: తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది, కాబట్టి రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం.
మందులు: డాక్టర్ సూచించిన మందులను సమయానికి వేసుకోవడం మర్చిపోకండి.
చలికాలం చలి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే, ప్రతిరోజూ యోగాను మీ జీవితంలో భాగం చేసుకోండి. దీనివల్ల ఆరోగ్యకరమైన గుండె, నియంత్రిత రక్తపోటు మీ సొంతమవుతాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..