
ప్రస్తుతం డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర స్క్రీన్లు ఉపయోగించడం అనేది కంటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. మనం ఎక్కువ సేపు స్క్రీన్ను చూసినా, కంటి కండరాలు అలసిపోతాయి, కళ్ళు పొడిబారతాయి. అంతేగాక, చూపు సమస్యలు పెరిగిపోతాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సరైన జీవనశైలి, పోషకాహారం, కొన్ని చిట్కాలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
స్క్రీన్ ఉపయోగిస్తున్నప్పుడు కనురెప్పలు సరిగ్గా వాల్చడం చాలా ముఖ్యం. మీరు కనీసం 60% తక్కువగా కనురెప్పలు వాల్చే అవకాశం ఉంటుంది. కనురెప్పలు వాల్చడం వల్ల కళ్ళు తేమగా ఉంటాయి, కళ్ల పొడిబారడం తగ్గుతుంది.
ప్రతిరోజూ 7–9 గంటల పాటు నిద్రపోవాలి. నిద్రలేమి వల్ల కళ్ళలో పొడిబారడం, కనురెప్పలు అవడం, దృష్టి మసకబారడం వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ 8–10 గ్లాసుల నీరు తాగాలి. డీహైడ్రేషన్ వల్ల కూడా కళ్ళు పొడిబారతాయి.
బయట ఉన్నప్పుడు UV రక్షణ ఉన్న సన్గ్లాసెస్ ధరించండి. ఇది కంటి శుక్లాలు, రెటీనా సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కంటి ఆరోగ్యం ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పోషకాలు:
ఈ చిట్కాలు కంటిపై ఒత్తిడిని తగ్గించి, చూపు దెబ్బతినకుండా కాపాడతాయి. అయితే, కంటి సమస్యలు సీరియస్గా మారితే.. వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.