ఎంజీఆర్‌ను అవమానించాడంటూ తమిళనాడులో రచ్చ..

|

Sep 04, 2020 | 6:24 PM

నటుడు విజయ్‌ అభిమానుల పొలిటికల్‌ బ్యానర్లు.. మరోసారి వివాదానికి కారణమయ్యాయి. 2021లో జరిగే ఎన్నికల్లో హీరో విజయ్‌ కీలక పాత్ర పోషించాలంటూ అభిమానులు పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటుచేశారు.

ఎంజీఆర్‌ను అవమానించాడంటూ తమిళనాడులో రచ్చ..
Follow us on

తమిళనాడులో సినిమా పొలిటికల్ రచ్చ మరొకటి తెరమీదికి వచ్చింది. నటుడు విజయ్‌ అభిమానుల పొలిటికల్‌ బ్యానర్లు.. మరోసారి వివాదానికి కారణమయ్యాయి. 2021లో జరిగే ఎన్నికల్లో హీరో విజయ్‌ కీలక పాత్ర పోషించాలంటూ అభిమానులు పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటుచేశారు. నటుడు విజయ్‌ని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ (MGR)తో పోలుస్తూ అభిమానులు హంగామా చేస్తున్నారు.

అయితే విజయ్‌ అభిమానుల అతి ఉత్సాహాన్ని అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ పార్టీ వ్యవస్థాపకుడిని కించ పరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో అభిమానులు ఏర్పాటుచేసిన పొలిటికల్‌ బ్యానర్లు నటుడు విజయ్‌కి తలనొప్పిగా మారాయి.

గత ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతు పలికిన నటుడు విజయ్‌.. ఈసారి ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తమిళనాట రాజకీయాలను నడిపించే సత్త అక్కడి సినిమా ప్రపంచానికి ఉంది. అక్కడి నటులు ఏది చెబితే అది… అంతే.  మరి ఇది ఎన్ని పొలిటికల్ టర్నులు తీసుకుంటుందో చూడాలి.