‘వందే భార‌త్ మిష‌న్’ విమాన టికెట్లకు భారీ డిమాండ్.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 'వందే భార‌త్ మిష‌న్' నాల్గో ద‌శ‌లో భాగంగా యూఏఈ నుంచి స్వ‌దేశానికి వ‌చ్చేందుకు భార‌త ప్ర‌వాసులకు ఇండియ‌న్ ఎంబ‌సీ నేరుగా

'వందే భార‌త్ మిష‌న్' విమాన టికెట్లకు భారీ డిమాండ్.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే..
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 11:20 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ‘వందే భార‌త్ మిష‌న్’ నాల్గో ద‌శ‌లో భాగంగా యూఏఈ నుంచి స్వ‌దేశానికి వ‌చ్చేందుకు భార‌త ప్ర‌వాసులకు ఇండియ‌న్ ఎంబ‌సీ నేరుగా విమాన‌ టికెట్ బుక్ చేసుకునే స‌దుపాయం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం ఉద‌యం ఈ టికెట్ల అమ్మ‌కం ప్రారంభ‌మైంది. దీంతో టికెట్‌లు బుక్ చేసుకోవడానికి దీరా, దుబాయిలోని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యాలయాల‌ ముందు ప్రవాసులు భారీగా బారులు తీరారు. అయితే, టికెట్ల విక్ర‌యం ప్రారంభ‌మైన గంట‌ల వ్య‌వ‌ధిలోనే మొత్తం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

కాగా.. నాల్గవ ద‌శలో భాగంగా యూఏఈ నుంచి భార‌త్‌లోని కేర‌ళ‌తో పాటు హైద‌రాబాద్‌, ల‌క్నో, ఢిల్లీల‌కు ఈ స్పెష‌ల్ ఫ్లైట్ న‌డ‌ప‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే www.airindiaexpress.in వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుకింగ్ ప్రారంభించిన భార‌త ఎంబ‌సీ… మిగిలిన టికెట్ల‌ను ఇలా నేరుగా విక్ర‌యిస్తోంది. కాగా, జూలై 15 వ‌ర‌కు టికెట్ బుకింగ్స్ ఓపెన్ ఉంటాయ‌ని అధికారులు చెప్పారు. ఇక జూలై 3 నుంచి నాల్గో ద‌శ‌ ‘వందే భారత్ మిషన్’ ప్రారంభంకానుంది. ప్రధానంగా యూఏఈలో చిక్కుకున్న వారిని భార‌త్‌కు తరలించడంపై కేంద్రం దృష్టిసారించింది.

Also Read: ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!