ఆస్ట్రేలియా టూర్‌కు డేట్ ఫిక్స్..

|

Oct 22, 2020 | 9:17 PM

సిడ్నీలోనే వాళ్లంతా క్వారెంటైన్ పూర్తి చేసుకుంటారు. ఈ ప‌ర్య‌ట‌నలో టీమిండియా నాలుగు టెస్టులు, మూడు వ‌న్డేలు, మూడు టీ20 ఆడ‌నున్న‌ది. న‌వంబ‌ర్ 27 నుంచి తొలి వ‌న్డే సిరీస్ ప్రారంభంకానున్న‌ది...

ఆస్ట్రేలియా టూర్‌కు డేట్ ఫిక్స్..
Follow us on

Team India Tour Of Australia : టీమిండియా పర్యటనకు ఆస్ట్రేలియా సర్కార్ పచ్చ జెండా ఊపింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న టీమిండియా పర్యటన వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌టించ‌నున్న‌ది. ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఐపీఎల్‌లో ఆడుతున్న భార‌తీయ క్రికెట‌ర్లు అక్క‌డ నుంచే నేరుగా సిడ్నీకి చేరుకుంటారు.

సిడ్నీలోనే వాళ్లంతా క్వారెంటైన్ పూర్తి చేసుకుంటారు. ఈ ప‌ర్య‌ట‌నలో టీమిండియా నాలుగు టెస్టులు, మూడు వ‌న్డేలు, మూడు టీ20 ఆడ‌నున్న‌ది. న‌వంబ‌ర్ 27 నుంచి తొలి వ‌న్డే సిరీస్ ప్రారంభంకానున్న‌ది.

అన్ని వ‌న్డే మ్యాచ్‌ల‌ను సిడ్నీలోనే ఆడ‌నున్నారు. ఆ త‌ర్వాత మూడు టీ20 మ్యాచ్‌ల కోసం క్యాన‌బెరా ప్ర‌యాణిస్తారు. డిసెంబ‌ర్ 17 నుంచి ఆస్ట్రేలియా, ఇండియా మ‌ధ్య తొలి టెస్టు మొదలవుతుంది. అడిలైడ్‌లో ఈ టెస్టు డే అండ్ నైట్ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గ‌నున్న‌ది.

మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టును నిర్వ‌హించ‌నున్నారు. సిడ్నీ, బ్రిస్బేన్‌లో మిగితా రెండు టెస్టులు జ‌రుగుతాయి. ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించే భార‌త జ‌ట్టుకు క్వారెంటైన్ ప్రోటోకాల్‌ను న్యూసౌత్ వేల్స్ ప్ర‌భుత్వం ఆమోదించింది. న‌వంబ‌ర్ 10న ఐపీఎల్ ఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత‌.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన కోహ్లీ సేన నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.