అచ్చెన్నాయుడికి తిరగబెట్టిన గాయం.. కంట్రోల్ కానీ బ్లీడింగ్..!
ఏపీ టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి సర్జరీ చేసిన గాయం తిరగబెట్టింది. ఇన్ఫెక్షన్ కారణంగా రక్తస్రావం కంట్రోల్ కావడం లేదని..మరోసారి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఏపీ టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి సర్జరీ చేసిన గాయం తిరగబెట్టింది. ఇన్ఫెక్షన్ కారణంగా రక్తస్రావం కంట్రోల్ కావడం లేదని..మరోసారి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారుల అనుమతితో మరోసారి ఆపరేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా నిమ్మాడ నుంచి విజయవాడ వరకు కారులో సుదీర్ఘ ప్రయాణం చేయడంతో గత ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కార్మికశాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నప్పుడు ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో భారీ స్కామ్ జరిగిందంటూ ఏసీబీ అధికారులు ఆయనను జూన్ 12న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.