తెరుచుకున్న శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లు

Srisailam Reservoir Gates Lifted : శ్రీశైలం రిజర్వాయర్‌ మూడు గేట్లు ఎత్తి నీటి కిందికి విడుదల చేశారు. ఈ సీజన్‌లో తొలిసారి శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లను అధికారులు ఎత్తారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం, తుంగభద్ర డ్యాంలకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడానికి ముందు నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  పూజలు  నిర్వహించారు. ఎగువన […]

తెరుచుకున్న శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లు

Updated on: Aug 19, 2020 | 8:16 PM

Srisailam Reservoir Gates Lifted : శ్రీశైలం రిజర్వాయర్‌ మూడు గేట్లు ఎత్తి నీటి కిందికి విడుదల చేశారు. ఈ సీజన్‌లో తొలిసారి శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లను అధికారులు ఎత్తారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం, తుంగభద్ర డ్యాంలకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడానికి ముందు నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  పూజలు  నిర్వహించారు.

ఎగువన భారీ వర్షాలతో జలాశయాలకు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి నీరు వస్తుండడంతో శ్రీశైలం రిజర్వాయర్‌ నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్‌ ఇన్‌ఫ్లో-3.85 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం-885 అడుగులు, ప్రస్తుతం-881.30 అడుగులు వరకు నీరు ఉంది. ఎగువన కర్ణాటక, తెలంగాణాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో వరద పెరిగే అవకాశం ఉందని అధికారులుఅంటున్నారు. తుంగభద్ర, కృష్ణాలో ప్రవాహంపై నీటి పారుదలశాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Follow Us