బాలు ఆరోగ్యం.. ఈ సోమవారం ఇంటికి..!

|

Sep 06, 2020 | 10:34 AM

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కోలుకోవాలంటూ ప్రపంచ సంగీత ప్రియులు చేసిన ప్రార్థనలు ఫలిస్తున్నాయి. మతం, ప్రాంతం అనే తేడాల లేకుండా అంతా కోరుకున్నారు. మా బాలు ఆరోగ్యం కుదుట పడాలని...

బాలు ఆరోగ్యం.. ఈ సోమవారం ఇంటికి..!
Follow us on

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కోలుకోవాలంటూ ప్రపంచ సంగీత ప్రియులు చేసిన ప్రార్థనలు ఫలిస్తున్నాయి. మతం, ప్రాంతం అనే తేడాల లేకుండా అంతా కోరుకున్నారు. మా బాలు ఆరోగ్యం కుదుట పడాలని, తిరిగొచ్చి ఇంపైన పాటలు పాడాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రార్థనలు ఫలిస్తున్నాయి. బాలు గొంతు సవరించుకోవడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఎస్పీబీ కుమారుడు ఎస్పీబీ చరణ్ చెప్పినట్లు.. ఆ శుభ సోమవారానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

చరణ్‌ ఓ వీడియోను విడుదల చేసిన వీడియోలో ఎస్పీబీ ఆరోగ్యంపై పూర్తి వివరాలను వెల్లడించారు. నాన్న ఆరోగ్యం నాలుగు రోజులుగా నిలకడగా ఉందని చెప్పారు. దేవుడి ద‌య‌, మీ అంద‌రి ప్రార్థన‌ల వ‌ల్ల వ‌చ్చే సోమ‌వారం నాటికి నాన్న ఆరోగ్య విష‌యంలో శుభవార్త వెలువడుతుంద‌ని ఆశిస్తున్నట్లు ఆయ‌న చెప్పారు.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. మీ అంద‌రికీ కృత‌జ్ఞత‌లు.. అని వీడియోలో చెప్పారు చరణ్‌.

కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీబీ ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు. మొదటి రెండు రోజులు ఆయన ఆరోగ్యం కొంత బాగున్నా.. ఆ తర్వాత ఎస్పీబీని ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్సను అందజేస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అధికంగా ఉండటంతో బాలు ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వైద్యులు అందిస్తున్న చికిత్సకు స్పందన రావడం.. వేగంగా కోలుకోవడంతో బాలును ఈ సోమవారం డిశ్చర్జీ  చేయనున్నారు.