లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించిన మార్కెట్లు

Sensex and Nifty Ended The Day with Gains : వీకెండ్ తర్వాత స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి. సెన్సెక్స్‌ 99 పాయింట్లు లాభపడి 36,693 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 10,802 వద్ద స్థిరపడ్డాయి. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 425 పాయింట్లు జంప్‌చేసింది. 37,000 పాయింట్ల కీలకమార్క్‌ను అధిగమించింది. ప్రధానంగా ఐటీ, మెటల్‌,ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలు లాభపడ్డాయి. అయితే బ్యాంకింగ్‌, రియల్టీ 1.5 శాతం స్థాయిలో నీరసించాయి. యస్‌బ్యాంక్‌, […]

లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించిన మార్కెట్లు

Edited By:

Updated on: Jul 13, 2020 | 5:27 PM

Sensex and Nifty Ended The Day with Gains : వీకెండ్ తర్వాత స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి. సెన్సెక్స్‌ 99 పాయింట్లు లాభపడి 36,693 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 10,802 వద్ద స్థిరపడ్డాయి. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 425 పాయింట్లు జంప్‌చేసింది. 37,000 పాయింట్ల కీలకమార్క్‌ను అధిగమించింది. ప్రధానంగా ఐటీ, మెటల్‌,ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలు లాభపడ్డాయి.

అయితే బ్యాంకింగ్‌, రియల్టీ 1.5 శాతం స్థాయిలో నీరసించాయి. యస్‌బ్యాంక్‌, శంకర బిల్డింగ్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఐడీబీఐ బ్యాంక్‌ వంటివి భారీగా నష్టపోయాయి. ఆసియ మార్కెట్లలో జపాన్‌ సూచీలు, చైనా, ద.కొరియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.