మేము రెడీగా ఉన్నాం..: ఆర్టీసీ సిటీ ఈడీ

హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమైయ్యాయి. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైయ్యాయి. శివారులోని ప్రతి డిపో నుంచి 12 బస్సులను నడుపుతున్నారు...

మేము రెడీగా ఉన్నాం..: ఆర్టీసీ సిటీ  ఈడీ
Follow us

|

Updated on: Sep 23, 2020 | 6:01 PM

హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమైయ్యాయి. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైయ్యాయి. శివారులోని ప్రతి డిపో నుంచి 12 బస్సులను నడుపుతున్నారు. త్వరలోనే సిటీలోనూ బస్సులు నడిపే అవకాశం ఉంది. 230 ఆర్టీసీ బస్సులను 135 రూట్లలో తిప్పుతున్నట్లు  టీవీ9 తో ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర రావు తెలిపారు. సిటీ సబర్బన్ ఏరియాకు 15 కి.మీ. దూరంలో తిప్పుతున్నట్లు చెప్పారు.

అయితే సిటీ బస్సుల కు సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు. తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతామని వస్తున్న వార్తలు వాస్తవం లేదన్నారు. సిటీ చివరలో 290 సర్వీసులను ఈరోజు నుండి నడిపించామన్నారు. సిటీ కి సంబంధించి చర్చ మాత్రమే జరుగుతుంది ఎలాంటి నిర్ణయం రాలేదని వివరణ ఇచ్చారు.  అన్ని డిపోలలో బస్సుల ను సిద్ధం చేసి ఉంచామన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఏర్పాట్లు కూడా చేసామని ఈడీ వెంకటేశ్వర రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి  ఆదేశాల రావడంతో బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.