‘తాత్కాలిక’ బాధ్యతలు ముగిశాయి.. మాకు దిక్కెవరు.?

|

Nov 29, 2019 | 4:02 PM

‘దీక్షా దివస్’ సందర్భంగా సీఎం కేసీఆర్.. ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లో చేరమని చెప్పేశారు. దీంతో సుమారు 52 రోజుల సమ్మెకు తెరపడింది. ఇక కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో కార్మికులంతా హర్షం వ్యక్తం చేయగా.. తాత్కాలిక ఉద్యోగులు మాత్రం తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఆదేశాల మేరకు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహించారు. వీరికి అనుభవం తక్కువున్నా.. ప్రభుత్వానికి అండగా ఉంటూ.. ప్రయాణికులను గమ్యస్థలాలకు చేర్చుతూ […]

తాత్కాలిక బాధ్యతలు ముగిశాయి.. మాకు దిక్కెవరు.?
Follow us on

‘దీక్షా దివస్’ సందర్భంగా సీఎం కేసీఆర్.. ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లో చేరమని చెప్పేశారు. దీంతో సుమారు 52 రోజుల సమ్మెకు తెరపడింది. ఇక కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో కార్మికులంతా హర్షం వ్యక్తం చేయగా.. తాత్కాలిక ఉద్యోగులు మాత్రం తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఆదేశాల మేరకు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహించారు. వీరికి అనుభవం తక్కువున్నా.. ప్రభుత్వానికి అండగా ఉంటూ.. ప్రయాణికులను గమ్యస్థలాలకు చేర్చుతూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరిపోవడంతో వీరి బ్రతుకులు రోడ్డున పడ్డాయి. జీడిమెట్ల డిపో తాత్కాలిక ఉద్యోగులు రోడ్డు మీద బైఠాయించి.. ‘సమ్మె కాలంలో బాధ్యతలు నిర్వర్తించామని.. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరడంతో తమ పరిస్థితి ఏంటని’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమ్మె మొదలైన రోజు నుంచి తాము డ్యూటీలు నిర్వహించామని.. ఇప్పుడు ఆర్టీసీ స్టాఫ్ డ్యూటీలలో చేరడంతో.. తమను పట్టించుకునే నాధుడే లేదని.. తాత్కాలిక బస్ డ్రైవర్లు, కండక్టర్లు వాపోయారు. కార్మికుల మాదిరిగానే తమపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దయ చూపించి ఆదుకోవాలని వీరంతా విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరానికి తీసుకుని.. అవసరం తీరాక వదిలేయడం సరికాదని.. భవిష్యత్తులో ఆర్టీసీలో ఉద్యోగాలు పడితే.. తమను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.