ORRపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఏడుగురు మృతి

|

Nov 10, 2020 | 7:27 AM

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాటి గ్రామ సమీపంలో జైలో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 10 మంది ప్రయణిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారు. వీరంతా జార్ఖండ్ (ఘోరఖ్ పూర్, రాంఘడ్ )కు చెందిన వారుగా పోలీస్ లు గుర్తించారు. వీరంతా కార్పెంటర్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ […]

ORRపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఏడుగురు మృతి
Follow us on

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాటి గ్రామ సమీపంలో జైలో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 10 మంది ప్రయణిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారు. వీరంతా జార్ఖండ్ (ఘోరఖ్ పూర్, రాంఘడ్ )కు చెందిన వారుగా పోలీస్ లు గుర్తించారు. వీరంతా కార్పెంటర్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలి సర్కిల్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర్నుంచి నుండి జార్ఖండ్ కు వెళ్తుండగా రింగ్ రోడ్డు పై ఈ ప్రమాదం సంభవించింది.